సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 13 : మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదులు, దర్గాలు, కబ్రస్థాన్ల అభివృద్ధికి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని తప్పకుండా త్వరలో దానికి శంకుస్థాపన చేసుకుని మూడు నాలుగు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుందామన్నారు. సూర్యాపేట పట్టణంలో ఒక మంచి వాతావరణం ఉందన్నారు.
మతమేదైనా ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా ఉంటారని తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఘర్షణలు లేపి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేక మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కుట్రలకు మనం తావివ్వవద్దని సూచించారు. అనంతరం ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయనగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రియాజుద్దీన్, షాహిద్ మౌలానా, ఉర్దూఘర్ చైర్మన్ కరాటే సయ్యద్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు చాంద్పాష, ఎస్కే. రఫీ, అజీజ్, నజీర్, జావిద్, మస్తాన్ పాల్గొన్నారు.