రాష్ట్ర అవిర్భావ దినోత్సవం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ , ప్రజా సంఘాలు జాతీయ పతాకాన్ని ఎగుర వేశాయి. వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు పుష్పగుచ్ఛం నివాళులర్పించారు.
కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, ఖుష్బూగుప్తా, అధికారులు పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయ ంలో చైర్మన్ బండ నరేందర్రెడ్డి జాతీయ పతకాలు ఎగురవేశారు.