మోటకొండూర్, డిసెంబర్ 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, కార్యకర్తలు కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మోటకొండూర్ బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వడ్డెబోయిన శ్రీలతను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్తో సీపీఐ, టీఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ అసమ్మతి నేతలు కలిసిరావడం మంచి పరిణామమని అన్నారు. శుక్రవారం మోటకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యులకు పూర్తి సహకారం అందించి గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటకొండూర్ బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థికి ప్రజల నుంచి భారీ స్పందన ఉందన్నారు. ఈసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని. బీఆర్ఎస్తో కలిసి నడుసున్న సీపీఐ, కాంగ్రెస్ నాయకులతో చర్చించి అనుకూలమైన వార్డులను కేటాయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టాలన్నారు.
మండల కేంద్రంలో బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలంతా సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి వడ్డెబోయిన శ్రీలత కోరారు. బీఆర్ఎస్తో సీపీఐ, టీఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ అసమ్మతి నేతలు కలిసిరావడంతో గెలుపు ఖాయమైందన్నారు. అనంతరం గొంగిడి మహేందర్రెడ్డి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను తీసుకున్న వడ్డెబోయిన శ్రీలత నామినేషన్ వేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు భూమండ్ల యాదయ్య, అనంతుల జంగారెడ్డి, సిరబొయిన నర్సంహులు యాదవ్, బొబ్బలి యాదిరెడ్డి, బురాన్, జివిలికపల్లి వెంకటేశ్, బుగ్గ భాస్కర్, అనంతరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు సిరబోయిన మల్లేశ్యాదవ్, వంగపల్లి మహేందర్, గడ్డం వెంకటేశ్ తదితరులు ఉన్నారు.