యాదగిరిగుట్ట, ఆగస్టు 29 : రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది. ఈ మేరకు నల్లగొండ రీజియన్ పరిధిలోని భువనగిరి, యాదగిరిగుట్ట బస్టాండ్లలో గిఫ్ట్ బాక్స్లను ఏర్పాటు చేసినట్లు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలు తమ టికెట్టు వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి గిఫ్ట్ బాక్స్లో వేయాలని సూచించారు. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా ద్వారా ముగ్గిరిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్, ఉప్పల్ నుంచి తిరుమలగిరి రూట్లలో అదనపు బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040- 23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.