తుంగతుర్తి, జనవరి 30 : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అందులో భాగంగానే మొన్న హరీష్ రావుకు, నిన్న కేటీఆర్ కు, నేడు కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు పంపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరలేపుతుందని మండిపడ్డారు.
ఇకనైనా పరిపాలన మీద సోది తెచ్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మట్టిపెల్లి శ్రీశైలం, దొంగరి శ్రీనివాస్, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, మనోజ్, రమేష్, కరుణాకర్, మండల నాయకులు మల్యాల రాములు, గుడిపాటి వీరయ్య, కడారి దాసు, గోపగాని రమేష్, మట్టిపెల్లి వెంకట్, సోమేశ్, యాకూబ్, గునిగంటి యాదగిరి, తునికి లక్ష్మి, గోపగాని శ్రీనివాస్, బొజ్జ సాయికిరణ్ వెంకటేష్, మల్లేష్, భాస్కర్, మహేందర్, వెంకన్న పాల్గొన్నారు.

Thungathurthy : కేసీఆర్కు సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం