పెన్పహాడ్, మార్చి 21 : మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు యూగేందర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దోసపహాడ్లో గల ఈద్గా వద్ద జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమన్నారు. సేవా దృక్పథం, భక్తి ప్రపత్తులు, సోదర భావాలు, మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ అమిరుల్లి కాసిం, షేక్ పెద్దమనిషి కాసిం, షేక్ బాలే జుబేర్, షేక్ హుస్సేన్, షేక్ చిన్న కాసిం, షేక్ జానీ, షేక్ మల్లెపూలు సైదా, షేక్ బిక్కన్ సాబ్, షేక్ బాల సైదా, దోసపహాడ్, అనాజిపురం గ్రామానికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు.