తుంగతుర్తి, జనవరి 13 : ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గానికి గోదావరి జలాలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్దే అన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చేస్తున్న పార్టీని ఆదరించాలని కోరారు.
జిల్లాలోనే నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొస్తున్న ఘనత కిశోర్దే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షమ పథకాలు దేశంలోనే పేరు గాంచాయన్నారు. ఎమ్మెల్యే కిశోర్కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచి 25 వేల మందికి పైగా ఖమ్మం సభకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే కిశోర్కుమార్కు ఎండ్లబండ్లతో స్వాగతం పలికారు. అంతకు ముందు మండలంలోని వెంపటి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అబ్బగాని పద్మాసత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గాదరి కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎంపీ, ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.