ఆత్మకూర్ ఎస్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు ప్రశాంతతకు నిలయాలుగా మారు తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కోటపహాడ్ గ్రామ ప్రకృతి వనాన్ని స్థానిక నేతలతో కలసి మంత్రి సందర్శించారు. ప్రకృతి వనాల తో ప్రతి ఊరు నందనవనమే అన్న మంత్రి పచ్చదనం కోసం ముఖ్యమంత్రి కెసీఆర్ వేసిన బృహత్ ప్రణాళికతో ప్రకృతి వనాలు పల్లెలో పచ్చదనం పరుచుకు న్నాయని హరితహారంలో కొత్త శోభను సంతరించుకునానయన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సుందరవనంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధుల కృషి అమోఘం అన్నారు. పల్లెలు, పట్టణాలలో పరిశుభ్రత..పచ్చదనం పెరిగిందన్నారు. అటవీ పునర్జీవన చర్యల్లో భాగంగా అడవుల్లో విస్తృతంగా మొక్కలు ఏర్పడుతున్నాయన్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉన్న నర్సరీలు లేవన్న మంత్రి గ్రామాలలోని ప్రకృతి వనాలు చిట్టడవుల్లా మారుతున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్యంపై మరింత దృష్టి సారించాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్, ప్రజాప్రనిధులు ఉన్నారు.