హాలియా: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యనందించడం జరుగుతున్నదని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియా ఎమ్మార్సీ కార్యాలయంలో అనుముల మండలంలోని 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జడ్పీ నిధుల నుంచి మంజూరైన రూ.4 లక్షల విలువ చేసే ల్యాబ్ మెటీరియల్ను ఆయన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనందున ఉపాధ్యాయు ల విద్యార్థుల ఇండ్లకు వెళ్లి విద్యార్థులు నూటికి నూరు శాతం తరగతులు హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. ప్రభు త్వ పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన బోజనంతో పాటు నాణ్యమైన విద్యనందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంఈవో బాలునాయక్, మున్సిపల్ చైర్మన్ గౌరవ సలహదారుడు వెంప టి శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, హాలియా జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి, టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.