కొండమల్లేపల్లి, డిసెంబర్ 01 : గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు గోవులతో వెళ్తున్న డీసీఎం మార్గమధ్యలో మండల కేంద్రంలోని నల్లగొండ బైపాస్ రోడ్డువద్ద ప్రమాదానికి గురైంది.
అయితే వేరే వాహనం సాయంతో డీసీఎంను డీసీఎంను తరలిస్తుండగా బీజేవైఎం నాయకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా 70 గోవులున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.