ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ
రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్షలకు టీఎస్ ఎడ్సెట్ ప్రత్యేక పరీశీలకులను నియమించింది. మధ్యాహ్నం 3గం. నుంచి సాయంత్రం 5గం. వరకు జరిగిన సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షకు విద్యార్థులు కొవిడ్ నిబంధనలతో హాజరయ్యారు. బుధవారం ఉదయం, సాయంత్రం కూడా ఈ పరీక్షలు జరుగనున్నాయి.
నల్లగొండలో జరుగుతున్న పరీక్షలను ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్.గోపాల్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను సజావుగా జరుపాలని సూచించారు. అదేవిధంగా నల్లగొండలో టీఎస్ ఎడ్సెట్ ప్రత్యేక పరీశీలకుడిగా డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ బి.నారాయణరెడ్డి, కోదాడలో ప్రత్యేక పరిశీలకుడిగా వీసీ కాలేజ్ ఆప్ ఎడ్యుకేషన్ సూర్యాపేట ప్రిన్సిపాల్ డా.దేవరాజ్ వ్యహరించారు.
కాగా మంగళవారం నల్లగొండలోని ఎస్పీఆర్ ఆన్లైన్ పరీక్షా కేంద్రంలో 180 మంది విద్యార్థులకు 157మంది హాజరవ్వగా 23 మంది గైర్హాజరయ్యారు. కోదాడలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 200 మంది విద్యార్థులకు 170 మంది హాజరుకాగా 30 మంది గైర్హాజరయ్యారు.