హుజూర్నగర్, ఫిబ్రవరి 20 : పంచాయతీ రాజ్ ఏఈ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మంగళవారం హుజూర్నగర్లో జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ ఉమ్మడి నల్లగొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వు మండల పంచాయ రాజ్ ఏఈగా కోసూరి రంగరాజు పనిచేస్తున్నాడు. అదే మండలంలోని కప్పుల కుండా తండాకు చెందిన ధారావత్ కృష్ణ కాంట్రాక్ట్ పనుల కింద పలు గ్రామాల్లో కరెంట్ స్తంభాలకు ఎల్ఈడీ బల్పులు ఏర్పాటు చేశాడు.
దానికి సంబంధించిన ఎంబీలు చేసే విషయంలో రంగరాజు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో కృష్ణ ఈ నెల 30న అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం మంగళవారం హుజూర్నగర్ పంచాయతీ రాజ్ డీఈ కార్యాలయంలో కృష్ణ ఏఈ రంగరాజుకు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ప్రభుత్వం అధికారులు లంచగా అడిగితే 91543 88918 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని డీఎస్పీ ఎంవీ శ్రీనివాస్రావు తెలిపారు.