ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు
కాంగ్రెస్ హయాంలో అధోగతి పాలైన పల్లెలు
బీజేపీ పాలనలో పెరిగిన పేదరికం
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగింది : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కేతేపల్లి మండలం భీమారంలో పల్లె ప్రగతి కార్యక్రమం
పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం కేతేపల్లి మండలం భీమారంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పర్యటించారు.
కేతేపల్లి, జూన్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని భీమారం గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ గ్రామాలు ఆర్థికంగా బలపడేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పల్లె ప్రగతి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మన ఊరు-మన బడితో రూ.కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు అందజేస్తామన్నారు. రైతులను దోచుకునేందుకు బీజేపీ ప్రభుత్వం రైతుల మోటర్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నదని విమర్శించారు.మీటర్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఒప్పుకుంటే రాష్ర్టాభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఇస్తామనడం కేంద్ర మంత్రి అమిత్షా దురహంకారానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ప్రాణాలు పోయినా రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేయనీయని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో బీజేపీకి గట్టిషాక్ తగిలిందన్నారు.రూ.350 గా ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1100 పెరుగడం కేంద్రప్రభుత్వం ప్రజలను ఎంతగా దోచుకుంటుందో అర్ధం చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ పథకాలు గుజరాత్లో లేవు : మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు 25 ఏండ్లుగా గుజరాత్లో లేవని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గుజరాత్లో ఇప్పటికీ కూడా కరెంటు కోసం రైతులు, మంచినీటి కోసం మహిళలు ధర్నాలు చేసే సంస్కృతి ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ సుమారు 2 వేల గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు రాత్రిళ్లు అంధకారంలో జీవనం గడుపుతున్నారని తెలిపారు. దేశంలోని అభివృద్ధి చెందిన 20 గ్రామాల్లో 19 గ్రామాలు మనరాష్ట్రం నుండే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్తో రాష్ట్ర రైతులకు ఒరిగేదేమి లేదన్నారు.కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
దేశానికి ఆదర్శం సీఎం కేసీఆర్ పాలన
సీఎం కేసీఆర్ పాలన ఆదర్శంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపెడుతున్నారని తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు నీళ్లు, నిధులు, కరెంటు కోసం నిత్యం ధర్నాలు జరిగేవని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పేదలకు ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. సర్పంచులకు నిధులు రావట్లేవని చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన 20 గ్రామాల్లో 19 గ్రామాలు మనరాష్ట్రం నుంచి ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా ప్రకటించిన కేంద్రానికి తెలంగాణలో కేసీఆర్ పరిపాలన గురించి పూర్తిగా అర్థమైందన్నారు.
బలహీనులకు ఉన్నత పదవులిచ్చిన ఘనుడు సీఎం కేసీఆర్ : ఎంపీ బడుగుల
గొర్రెలను మేపుకునే కులంలో జన్మించిన నన్ను పెద్దల సభకు పంపిన సీఎం కేసీఆర్కు జీవితకాలం రుణపడి ఉంటానని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
సుభిక్ష పాలన అందిస్తున్న వ్యక్తి కేసీఆర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ కృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్డీఓ జగదీశ్రెడ్డి, కొప్పోలు సర్పంచ్ చింతమళ్ల అశ్విని, నంద్యాల దయాకర్రెడ్డి పాల్గొన్నారు.
భీమారంపై వరాలజల్లు
భీమారం గ్రామాభివృద్ధికి మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రామానికి అనుసంధానంగా ఉన్న మూడు గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీల వరకు నూతన భవనాలు నిర్మించి పలు గ్రామాల్లో లింక్ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పీహెచ్సీ నిర్మాణం చేస్తామని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.