మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. తొలిరోజు నల్లగొండ జిల్లాలో 155 దుకాణాలకుగానూ 11, సూర్యాపేట జిల్లాలో 99 దుకాణాలకుగానూ 2 దరఖాస్తులు వచ్చాయి.
– నల్లగొండ, ఆగస్టు 4
నల్లగొండ, ఆగస్టు 4: మద్యం దుకాణాల రెండేండ్ల నిర్వహణకు నోటిఫికేషన్ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని రామగిరిలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్ సంతోష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం నుంచి ఈ నెల 18వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగానే ఎ స్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో155 దుకాణాలకుగానూ 52 దుకాణాలు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దాంతో ఆయా ప్రాంతాలు టెండర్ దారులతో సందడిగా కనిపించాయి. తొలి రోజు 11 దరఖాస్తులు నమోదైనవి.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ 7 ఎస్హెచ్ఓలకు టెండర్ల స్వీకరణ కోసం జిల్లా కేంద్రExcise Department ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నల్లగొండలోని రామగిరిలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో 5ఎస్హెచ్ఓలకు దరఖాస్తులు హాలియా, నకిరేకల్, చండూర్, నాంపల్లి, దేవరకొండ పరిధిలోని దుకాణాలకు టెండర్లు స్వీకరిస్తారు.
మిర్యాలగూడ రోడ్డులోని బట్లింగ్ వద్ద ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో 2 ఎస్హెచ్ఓలకు… నల్లగొండ, మిర్యాలగూడ పరిధిలోని దుకాణాల టెండర్లు స్వీకరిస్తారు.
కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తెలంగాణ కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 155 వైన్స్లకు వచ్చిన దర ఖాస్తుల(టెండర్ల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అయితే ఈనెల 21న జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్స్లో ఉదయం 11గంటలకు ప్రక్రియ ప్రారంభిస్తారు.
దరఖాస్తుతోపాటు వీటిని విధిగా సమర్పించాలి. దరఖాస్తు రుసుం రూ. 2లక్షలు డిడి లేదా చలానా రూపంలో
3 రీసెంట్ పాస్ పోర్టు సైజు కలర్ ఫోటోలు( అభ్యర్థ్ధి, అభ్యర్థ్ధి స్థానంలో లాటరీ నందు హాజరయై ప్రతినిధి ఫొటో)
ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ కాపీలు
ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్ కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకుంటే అండర్ టెకింగ్ పత్రం సమర్పించాలి.
జిల్లాలోని మద్యం (వైన్స్) దుకాణాల నిర్వహణ కోసం టెండర్ల స్వీకరణ షూరు చేయడంతో ఆయా ప్రాంతాల్లో సందడి కనిపించింది. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 11 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.