నిడమనూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని తుమ్మడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఎంఎఫ్ నిధులు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన మూత్రశాలలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్ధులు విద్యనభ్యసించే పాఠ శాలలకు అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. పాఠశాలల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, జిల్లా నాయకులు చేకూరి హనుమంతరావు, ఎంఈవో ఎల్.బాలు నాయక్, ఏఈ వరలక్ష్మి, తుమ్మడం సర్పంచ్ కుంకుట్ల కోటమ్మ, ఎంపీటీసీ పెదమాం యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ పోలె డేవిడ్, బొల్లం రవియాదవ్, నాయకులు నల్లబోతు వెంకటే శ్వర్లు, మధుబాబు, అంజయ్య యాదవ్, గడ్డం సత్యనారాయ ణ రెడ్డి, అల్వాల కళావతి, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉన్నం భాస్కర్, చింతపల్లి వెంకన్న, నారబోయిన శంకర్ గౌడ్, గోవిందు, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.