నందికొండ, జనవరి 31 : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో తాగు నీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 6వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసే నీటిని రైతులు పంట పొలాలకు వినియోగించ వద్దని సూచించారు.