నల్లగొండ, నవంబర్ 20 : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో సోమవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. నల్లగొండతో పాటు మండలం, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జనసమీకరణ చేయగా అంచనాలకు మించి జనం హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు రైల్వే ట్రాక్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. పానగల్ ైపె ్లఓవర్ నుంచి -చర్లపల్లి నుంచి సభా ప్రాంగణం వరకు హైవేపై పెద్ద సంఖ్యలో జన సందోహంతో సభా ప్రాంగణం అంతా కిటకిటలాడింది.
సీఎం కేసీఆర్ సభా ప్రాంగణంపైకి వచ్చి అందరికీ అభివాదం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న సమయంలో ప్రజలు జేజేలు పలుకుతూ మద్దతు తెలిపారు. కాంగ్రెసోళ్లు అన్నట్లు మూడు గంటల కరెంట్ కావాలా..24 గంటల కరెంట్ కావాలా అన్నప్పుడు మూడు గంటలు చాలదు 24 గంటలే కావాలి అని ప్రజలు నినదిస్తూ చెప్పారు. నల్లగొండ గత ఎన్నికల్లో దత్తత తీసుకొని రూ.1,400 కోట్లతో అభివృద్ధ్ది చేస్తున్న అయితే ఇంకా నల్లగొండ దత్తత అయిపోలేదు..నా దత్తతలోనే ఈ నల్లగొండ ఉన్నది..దీన్ని అభివృద్ధ్ది చేసే బాధ్యత నాదే అని అన్నప్పుడు కేరింతలతో సంఘీభావం తెలిపారు.
బోర్ల రామిరెడ్డి.. సమైక్యాంధ్రలో తనకున్న పదెకరాల భూమిలో ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో బైరెడ్డి రాంరెడ్డి కాస్త బోర్ల రామిరెడ్డిగా మారాడు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో సైతం ప్రస్తావించారు. నాడు బోర్ల రామిరెడ్డి 54 బోర్లు వేసినా ఒక చుక్క నీరు కూడా రాలేదు. కానీ నేడు నల్లగొండలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయన్నారు. నేడు వరి సాగు జోరుగా అవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పీచ్ అనంతరం బోర్ల రామిరెడ్డి వేదికపైకి రావడంతో ఆయనను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని యోగ క్షేమాలు తెలుసుకున్నారు. సభా ప్రాంగణంలో తుంగతుర్తికి చెందిన కళాకారుడు సందీప్ ఆధ్వర్యంలో తెలంగాణ పాటలు పాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షుడు ఇరిగి సునీల్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కం డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలీ, చకిలం అనిల్ కుమార్, కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, యూసఫ్ జావెద్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, కోటి రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఉమామాధవ రెడ్డి, పాల్వాయి స్రవంతి, దొంతు రామ్మోహన్, వెంకటేశ్వర్లు, బొర్ర సుధాకర్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్తో పాటు కౌన్సిలర్లు, నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడుగుల పల్లి మండల పార్టీల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ : నల్లగొండలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఆధికసంఖ్యలో తరలివచ్చారు. దాంతో సభ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా గులా బీ జెండాలు కళకళలాడాయి. సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఈలలు, కేరింతలతో స భా వేదిక దద్దరిల్లింది.