నీలగిరి: వాయు కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన అరోగ్యకర వాతావరణం పెంపోందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన భూగోళం అనే అంశంతో ఇంటర్నేషనల్ డే అప్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ వర్క్షాపును నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం నియంత్రించాలని, పర్యావరణం కాలుష్యం లేకుండా మట్టి విగ్ర హాలను వినాయక చవితికి పూజించాలని అన్నారు. ప్రభుత్వం పచ్చదనం, పర్యావరణం పెంపుకు హరితహారం కార్యక్ర మం ద్వారా మొక్కలు నాటి మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు.
15 సంవత్సరాలు దాటిన వాహనాలను కాలుష్యం రాకుండా రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. ఈ వర్క్షాపులో పర్యావరణ ఇంజినీర్ రాజేందర్, ఎఎస్వో నిత్యానందం. జేడీఏ శ్రీధర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ శ్రీని వాస్, ఆర్టీసీ అధికారి శ్యామల, పరిశ్రమల అధికారి సతీశ్, పర్యావరణ ప్రేమికుడు సురేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.