కొండమల్లేపల్లి, మే 8 : నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని, ఆరు గారెంటీలను ఇంతవరకూ అమలు చేయలేదని మండిపడ్డారు. రైతుబంధు రూ.15 వేలు, ఆసరా పింఛన్లు రూ.4 వేలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, పంటలకు రూ.500 బోనస్, ఆడ బిడ్డలకు రూ.2,500 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు కాలయాపన చేస్తున్నదని తెలిపారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు ఆగస్టు 15కు వరకు రైతు రూణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని, ప్రజలు నమ్మొద్దని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆగం కావద్దని, కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త మల్లికార్జన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, మారం రవీందర్రెడ్డి, కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాధ్యక్షులు టీవీఎన్రెడ్డి, రమావత్ దస్రూనాయక్, మండల యువజన అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, పెద్దిశెట్టి సత్యం, దాచేపల్లి నరేందర్, ముడావత్ పాండు నాయక్, నేనావత్ శంకర్నాయక్, రమావత్ దీప్లానాయక్, రమావత్ రూప్లానాయక్, పేట రమేశ్, వడ్త్యా బలరాం నాయక్, జబ్బు యాదయ్య యాదవ్, పంగలాలయ్య, నేనావత్ శంకర్నాయక్, వరికుప్పల పాండు, ఎం. శేఖర్యాదవ్, గిరి, రావుల సత్యనారాయణ, శ్రీనునాయక్ పాల్గొన్నారు.