నీలగిరి, డిసెంబర్ 18 : విద్యుత్ ఆదా చేయడంలో నల్లగొండ మున్సిపాలిటికీ రాష్ట్ర స్థ్దాయిలో గోల్డెన్ అవార్డు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఇస్తున్న బంగారు పతకాల్లో భాగంగా 2021 -22 సంవత్సరానికి నల్లగొండ మున్సిపాలిటీకి ఈ ఘనత దక్కింది. నల్లగొండలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పట్టణ సుందరీకరణ, పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి విద్యుత్ వృథాపైనా ప్రత్యేక దృష్టి సారించారు.పట్టణంలో విద్యుత్ వృథా కాకుండా అరికట్టారు. అంతేగాకుండా విద్యుత్ అధిక వినియో గం, విద్యుత్ అవసరాలకు గుర్తించారు.
గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో ప్రతి నెలా రూ. 17.50లక్షల విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అయితే విద్యుత్ ఆదాకు చర్యలు చేపట్టడంతోపాటు ఎల్ఈడీ లైట్లను కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం రూ. 16 లక్షల బిల్లులు వస్తున్నాయి. దాంతో ప్రతినెలా రూ. 1.50 లక్షల విద్యుత్ బిల్లులు మున్సిపాలిటీకి మిగిలాయి.
నల్లగొండ మున్సిపాలిటీకి జనాభా ప్రకారంగా కేటాయించిన విద్యుత్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2.300 మిలియన్ కిలో వాట్స్ విద్యుత్ వినియోగం అవుతుండగా 1.60 మిలియన్ కిలో వాట్స్ ఆదా చేశారు. 2020-21లో 2.344 మిలియన్ కిలో వాట్స్ విద్యుత్ వినియోగం కాస్త 2.606 మిలియన్ కిలోవాట్స్కు తగ్గింది.
2021-22 లో 2.112 కిలోవాట్స్ విద్యుత్ను వినియోగించి 3.328 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ను ఆదాచేశారు. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీకి గోల్డెన్ అవార్డును ప్రకటించింది. కాగా ఈ అవార్డును ఈనెల 20న హైదరాబాద్ విపస్యభవన్లో రా్రష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి అందుకోనున్నారు.