త్రిపురారం, నవంబర్ 26 : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ అందిస్తుందని తాసీల్దార్ కేసీ ప్రమీల, ఎంపీడీవో అలివేలుమంగమ్మ అన్నారు. మండలంలోని మాటూరు, లోక్యాతండా గ్రామాలతో పాటు, పలు గ్రామాల్లో పోడు భూముల గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూములకు సంబంధించి రైతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రస్తుతం సర్వే కొనసాగుతుందన్నారు. సమావేశంలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు లలితా పాండునాయక్, హన్మంతునాయక్, ఎంపీపీ గౌరవ సలహాదారు అనుముల శ్రీనివాస్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని అజ్మాపురం, పాయతండా, బాణాలకుంట, పుట్టంగండి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. రైతుల దరఖాస్తులు పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ మోహన్రెడ్డి, సర్పంచ్ ఆదిరాల నాగేశ్, భీమానాయక్ పాల్గొన్నారు