డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి
నీలగిరి, మే 19 : సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వలంటీర్లుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వాసవీ క్లబ్ నల్లగొండ గ్రేటర్ ఆధ్వర్యంలో మంచికంటి నర్సయ్య జ్ఞాపకార్థం పోలీస్ సిబ్బందికి భోజనం, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సభ్యులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ గ్రేటర్ అధ్యక్షుడు బాశెట్టి అశోక్ కుమార్, అసిస్టెంట్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ, నాయకులు కాసం శేఖర్, ప్రదీప్, శ్రీకాంత్, సీఐలు సురేశ్, చంద్రశేఖర్రెడ్డి, అనిల్, ఎస్ఐలు నర్సింహులు, రాజశేఖర్రెడ్డి, జనగణమన ఉత్సవ కమిటీ సభ్యులు పోలా జనార్దన్, పోలోజు నాగేందర్, చర్లపల్లి గౌతమ్ ఉన్నారు. అదేవిధంగా నార్కట్పల్లి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి-శోభ దంపతులు క్లాక్టవర్ సెంటర్, జిల్లా జనరల్ దవాఖానలో పోలీసులకు, ప్రభుత్వ దవాఖాన సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్బాటిళ్లు అందించారు.
కరోనా పరీక్ష కిట్లు అందజేత
మునుగోడు : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వితరణతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి కరోనా పరీక్ష కిట్లను డీఎంహెచ్ఓ కొండల్రావుకు బుధవారం అందించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణాధికారి కళ్యాణచక్రవర్తి, పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, తాటికొండ సైదులు, శ్రీను పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ..
మునుగోడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఏఎస్ఐ యాదగిరి పిచికారీ చేయించారు. వీరి వెంట ఉప సర్పంచ్ పవిత్ర, కార్యదర్శి మురళీమోహన్ ఉన్నారు.
వెలుగుపల్లిలో మాస్క్లు పంపిణీ..
నల్లగొండ రూరల్ : నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బంది, ప్రజలకు మాస్క్లు, శానిటైజర్లను సర్పంచ్ ఈగల శైలజ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, కార్యదర్శి సునీత, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మంగళపల్లిలో నిత్యావసర సరుకులు..
కట్టంగూర్(నకిరేకల్) : నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో కరోనా బాధిత 17 కుటుంబాలకు నిత్యావసర సరుకులను టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బచ్చులపల్లి గంగాధర్రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సురేశ్, రాములు, మంగమ్మ, రామలింగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా నకిరేకల్, చందంపల్లి గ్రామాల్లోని కరోనా బాధిత కుటుంబాలకు హైదరాబాద్కు చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సహకారంతో 75కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, రూ.2500 నగదు అందజేశారు. బ్రహ్మదేవర నరేశ్, సరితారెడ్డి, సింగరపు మారుతి, జితేందర్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల పరిధిలోని మాదారం, వంగమర్తి గ్రామాల్లో రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, మామిడి సర్వయ్య, మురళి, యాదగిరి, కృష్ణమూర్తి, శేఖర్బాబు, అనిత, శంకర్, వెంకన్న పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : నల్లగొండలోని డ్రైవర్లకు తుమ్మురుగోటి కార్తీక్ సాయిబాబా ట్రస్టు తరఫున బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పంతులు శ్రీనివాస్, సుగుణ, జయదుర్గ, సాయినాథ్, నాగార్జున, వాణి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి ఆర్థిక సాయం..
చిట్యాల : కరోనా కారణంగా మృతిచెందిన కుటుంబాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. బుధవారం ఆయన చిట్యాల మున్సిపాలిటీలో పర్యటించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల సాయం అందించారు. మొత్తం ఏడు కుటుంబాలకు సాయం అందించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో వెంట మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు గుండెబోయిన సైదులు, జిట్ట బొందయ్య, సిలివేరు శేఖర్, జిట్ట చంద్రకాంత్, భిక్షంరెడ్డి, చిత్రగంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.