బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరితో పేదల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. పాల ఉత్పిత్తిపై ఆధారపడి అనేక మంది రైతులు జీవనం సాగిస్తున్నారని, వాటి ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ద్వారా ప్రధాని మోదీ తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువు చేసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంటేశ్యాదవ్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, నాయకులు సీతావెంకటేశం, కందాడి భూపాల్రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, గుండు మధు, పాల్గొన్నారు.
జీఎస్టీని ఉపసంహరించుకోవాలి
వలిగొండ, జూలై 22 : నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పులిగిల్ల, కేర్చిపల్లి, ఎం.తుర్కపల్లి గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాలపై జీఎస్టీ వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజపై ఆర్థిక భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మెరుగు వెంకటేశం, కొమ్మిడి లక్ష్మారెడ్డి, బాలరాజు, వెంకటయ్య, స్వామి, ఐలయ్య, సంజీవ, ఆనంద్, నాగరాజు, మల్లారెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.