స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలికల జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నది. గురువారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో వరంగల్ జిల్లా జట్టుపై 48-42 స్కోరుతో విజయకేతనం ఎగురవేసింది.
బాలుర విభాగంలో జిల్లా జట్టు ఫైనల్లో ఓడి ద్వితీయ బహుమతి గెలుచుకున్నది. విజేతలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.