నల్లగొండ ప్రతినిధి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు, మూడు పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు, మూడు రోజుల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ను కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, ఒంటెద్దు నర్సింహారెడ్డి ఉన్నారు.