గతేడాది కంటే వారం ముందుగానే ఇస్తున్న ప్రభుత్వం
ఎడమ కాల్వకు రేపు నీటి విడుదల
నందికొండ, జులై 26 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో రిజర్వాయర్లో రెండు పంటలకు సరిపడా నీరు ఉండడంతో ఎన్నెస్పీ అధికారులు ముందస్తుగా వానకాలం సాగుకు నీటి విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నీటి విడుదల చేయనున్నట్లు ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ తెలిపారు. గతేడాది ఆగస్ట్టు 5న విడుదల చేయగా ఈయేడాది వారం రోజుల ముందుగా ఈ సారి ఎడమ కాల్వకు నీటి విడుదల చేయనున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు జలకళ
శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతూ జలకళను సంతరించుకుంటుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం రిజర్వాయర్ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 63,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. కృష్ణ్ణా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఆల్మటి, నారాయణపూర్, జురాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు నిలకడగా ఇన్ఫ్లో శ్రీశైలానికి కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590( 312 టీఎంసీ) అడుగకులకు 54.30( 203.8695 టీఎంసీ) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడికాల్వ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, వరద కాల్వల ద్వారా నీటి విడుదల లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 1000 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయికి 885 అడుగులకు 880.80 (192.5300 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలానికి 5,1140 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.