రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మన ఊరు – మన బడి పాఠశాలలను ప్రారంభించారు. రీడింగ్ కార్నర్స్ (గ్రంథాలయాలు),డిజిటల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులను సన్మానించారు. పాఠశాలల్లో రాగి జావ పంపిణీని షురూ చేశారు. అనంతరం జరిగిన సభల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యా ప్రగతిని వివరించారు.
చండూరు/మునుగోడు రూరల్, జూన్ 20 : విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డ, మునుగోడు మండలం కొంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యాదినోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు రాగి జావ, నోటు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. కొంపల్లి ఉన్నత పాఠశాలలో ఎంపీ ల్యాడ్స్ రూ. 50 లక్షల నిధులు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సాధించిన ప్రగతిని వివరించడానికి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తీరును ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు పల్లె కల్యాణి, కర్నాటి స్వామి యాదవ్, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణీ రవి, కర్నాటి వెంకటేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవీవెంకట్ రెడ్డి, ఎంపీడీఓలు యాకూబ్ నాయక్, రాపర్తి భాసర్, ఎంపీటీసీలు ఈద నిర్మలా శరత్ బాబు, పొలగోని విజయలక్ష్మీసైదులు, సర్పంచులు పల్లె వెంకటయ్య, జాల వెంకన్న, జాజుల పారిజాత సత్యనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, డీఈఈ రఘుపతి బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి బోయపర్తి సురేందర్ పాల్గొన్నారు.
మర్రిగూడలో కిచెన్షెడ్ ప్రారంభం
మర్రిగూడ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని లెంకలపల్లిలో రూ.33 లక్షల నిధులతో నిర్మించిన కిచెన్ షెడ్, టాయిలెట్స్, మెటీరియల్ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు,యూనిఫారాలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రైతులతో మాట్లాడారు.వారి సమస్యలపై అధికారులు,ప్రజాప్రజానిధులతో చర్చించారు.ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి,ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు, ఎంఈఓ గురువారావు,మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీష్, సర్పంచ్ పాక నగేశ్ యాదవ్,ఏపీఎం సంకు హరి, సహకార చైర్మన్ బాలం నర్సింహ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు పందుల పాండు గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
విద్యాతోనే సమగ్రాభివృద్ధి: కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్
మునుగోడు : విద్యాతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశా లలో జెండా ఎగురువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, తెలంగాణలో 1,002 గురుకుల పాఠశాలలను నెలకొల్పి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అంతకు ముందు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల, గురుకుల, కస్తూరిబా,ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఎంపీటీసీ బొడ్డుశ్రావణీ నాగరాజుగౌడ్,అనంత లింగస్వామి గౌడ్, హెచ్ఎం నకిరికంటి యాదయ్యగౌడ్, విశ్రాంతి ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, డిప్యూటీ డీఎంహెఓ డాక్టర్ కళ్యాణచక్రవర్తి, బీఆర్ఎస్రాష్ట్ర నాయకుడు నారబోయిన రవిముదిరాజ్, డాక్టర్ అంజయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గోపగోని యాదగిరి, ముచ్చపోతుల శ్రీనివాస్, జ్యోతీనాగేంద్రప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ పందుల పాపయ్య, పందుల మల్లేశ్,పగడాల నాగయ్య పాల్గొన్నారు.
విద్యారంగం అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం
చౌటుప్పల్: విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు. మున్సిపాలిటీపరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవంలో ఆయన పాల్గొని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండీ బాబాషరీఫ్, ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు, బొడిగె అరుణాబాలకృష్ణా గౌడ్, అంతటి విజయలక్ష్మీబాలరాజు గౌడ్ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని ఖుదాభక్ష్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంబోతు సుధాకర్ నాయక్,ఉప సర్పంచ్ మైలారపు పార్వతమ్మాగిరేశ్, పందుల పాండు గౌడ్ పాల్గొన్నారు.
సంస్థాన్నారాయణపురం : మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యా దినోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు అందజేశారు.
చౌటుప్పల్ : మండలంలోని దేవలమ్మ నాగారం పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని షేక్ సానియాకు దాత బి.అనిల్కుమార్ రెడ్డి సమకూర్చిన రూ.10 వేల నగదు చెక్కును సర్పంచ్ కల్లె శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పద్మ, సురేఖ పాల్గొన్నారు.
నాంపల్లి : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ల్లో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటర్, పదో తరగతిలో పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులన శాలువాలతో సన్మానించి, నగదు ను బహుమతిగా అందజేశారు. కా రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, ప్రిన్సిపాల్ కవిత, ఎస్ఎంసీ చైర్మన్ జెల్లాల శ్రీను, నాయకులు ఎస్కేఅబ్బాస్ , జెల్లా సైదులు, సపావత్ సర్దార్, నాయక్ పాల్గొన్నారు.