భూత్పూర్, ఆగస్టు 17 : సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డి మాండ్ చేశారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల ను ధరించి ర్యాలీని చేపట్టి మహబూబ్నగర్ రో డ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే మార్పుగా భావిస్తుందని ఎద్దే వా చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో, బోనస్ ఇవ్వడంలో ప్రజలను పూర్తిగా మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. పేదింటి ఆడపిల్ల పెండ్లికి ప్రభుత్వం ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వచ్చే రూ. 1,00,016లు ఎంతో మే లే చేస్తాయని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి పథకాన్ని ఎత్తివేయడం దారుణమన్నారు.
అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీగా మండల పరిషత్ కార్యాలయం వరకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని కొనసాగించాలని తాసీల్దార్ కిషన్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు ఆల శ్రీకాంత్రెడ్డి, సురేశ్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్కుమార్, మాజీ స ర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, నర్సింహాగౌడ్, శ్రీనివాస్గౌడ్, నాగయ్య, ఆంజనేయులు, నాయకులు మురళీధర్గౌడ్, సత్యనారాయణ, అశోక్, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.