కట్టంగూర్/ కేతేపల్లి/ నార్కట్పల్లి/ రామన్నపేట, జనవరి 22 : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలో 41మందికి, కేతేపల్లి మండలంలో 33 మందికి, నార్కట్పల్లి మండలంలో 100 మందికి, రామన్నపేట మండలంలో 37 మంది లబ్ధ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయా మండలకేంద్రాల్లో సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడంతో గమనించి సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాగపూర్ నుంచి విజయవాడ వరకు పరిశ్రమల కారిడార్గా మార్చడంతో పాటు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కల్యాణలక్ష్మీ చెక్కుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు గైడ్లైన్స్ చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. చిట్యాల – భువనగిరి రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు త్వరలోనే టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కట్టంగూర్లో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, తాసీల్దార్ డొంకెన స్వప్న, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, సర్పంచులు చెనగోని సతీష్, అయితగోని నారాయణ, సుంకరబోయిన వెంకన్న, పనస సైదులు, ఎంపీటీసీలు మాద యాగిరి, హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, కేతేపల్లిలో ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్రెడ్డి, తాసీల్దార్ ఎన్.మధుసూదన్రెడ్డి, ఎంపీడీఓ వై.హరికృష్ణ, నార్కట్పల్లిలో ఎంపీడీఓ యాదగిరి,
తాసీల్దార్ పద్మ, రామన్నపేటలో జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్, తాసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, వైస్ ఎం పీపీ నాగటి ఉపేందర్, సర్పంచులు గోదాసు శీరిషాపృథ్వీరాజ్, గుత్తా నర్సిరెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, రేఖ యాదయ్య, ఉప్పు ప్రకాశ్, చెరుకు సోమయ్య, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్రెడ్డి, ఎండీ రేహాన్, వనం హర్షిణి, జ్యోతి, పూస బాలమణి, రమేశ్, గోగు పద్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
చిట్యాల :మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన రేణుకా ఎల్లమ్మ కోలాట బృందానికి ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం డప్పులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోనేటి యాదగిరి, చెరుకు సైదులు, పట్ల జనార్దన్, బొడ్డు శ్రీను, కురుపాటి లింగయ్య, చెరుకు యాదమ్మ, మెడబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు.