చిట్యాల/కట్టంగూర్, జనవరి 30 : గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మురుగుకాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు. వనిపాకల, వేంబావి, తాళ్ల వెల్లంల, బోయగుబ్బ, మొగలిదోరి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి, ముత్యాలమ్మగూడెం, పరడ, మునుకుంట్ల, పందనపల్లి, కట్టంగూర్, బొల్లెపల్లి, అయిటిపాములలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. చిట్యాల కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, సర్పంచులు బుర్రి రవీందర్ రెడ్డి, మేడి లింగమ్మానర్సింహ, అద్దెల నర్సిరెడ్డి, జనగాం రవీందర్ అంతటి వెంకటేశ్, ఎంపీటీసీ లక్ష్మయ్య, నాయకులు గుడిపాటి లక్ష్మీనర్సింహ, నర్రామోహన్ రెడ్డి, కాటం వెంకటేశం, బట్టు ఐలేశ్ పాల్గొన్నారు. కట్టంగూర్ కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఎంపీఓ అథర్ పర్వేజ్, సర్పంచులు పులిగిల్ల అంజయ్య, గడుసు అనితాసుధీర్రెడ్డి, పుట్ట సుజనావెంకట్రెడ్డి, బెజవాడ సరోజనాసైదులు, ఐతగోని నారాయణ, గద్దపాటి సీతమ్మ, చెనగోని సతీశ్, మేడ రేణుక, వెంకన్న, ఎంపీటీసీ భవాని పాల్గొన్నారు.
కేతేపల్లి :మండల కేంద్రంలో రూ.5 లక్షలతో, కొర్లపహాడ్లో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం శిలాఫలకం ఆవిష్కరించారు. ఎంపీపీ పెరుమాళ్ల శేఖర్, సర్పంచులు జటంగి ముత్తమ్మ, ఎడ్ల పార్వతమ్మ, ఎంపీటీసీ ఎడ్ల సంధ్యాప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.