మాల్, డిసెంబర్ 2 : పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని ఘడియగౌరారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవ లోగిళ్లు మన డబుల్ బెడ్రూం ఇండ్లు అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలే రెండు కండ్లుగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఉజ్జిని లక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు విద్యాసాగర్రావు, అండెకారు అశోక్, జి.కిష్టారెడ్డి, రవి, నరేందర్రావు, మల్లేశ్యాదవు, పోషయ్య, శ్రీనుయాదవ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.