భువనగిరి అర్బన్, అక్టోబర్ 18 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో వలసలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పెంచికల్పహాడ్ గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు పట్టణ పరిధిలోని ఓ హోటల్లో ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల కడుపునింపేలా ఉన్నాయన్నారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలనే కోణంలో సీఎం కేసీఆర్ ఊహకందని పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ప్రతీ కుటుంబానికి సీఎం కేసీఆర్ బీమా కల్పించడంతో ఎంతో ధీమా ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఉన్నాయన్నారు. పేదల సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు ఉంటారన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలం ఓంప్రకాశ్గౌడ్, నాయకులు సిలువేరు యేసు, జడల యశీల్గౌడ్, సిలువేరు మధు, సందీప్ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రోడ్డు మార్గం ఏర్పాటుతో పట్టణంలో అర్బన్కాలనీ ప్రజల ఏండ్ల నాటి సమస్య తీరింది. దీనికి కృతజ్ఞతగా అర్బన్ కాలనీ ప్రజలు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ అర్బన్ కాలనీ మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితోనే సాధ్యమన్నారు.
వచ్చే ఎన్నికల్లో మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు కుశంగల రాజు, జాంగీర్, కడారి వినోద్, ఇట్టబోయిన గోపాల్, నాకోటి నగేశ్, పట్టణ యూత్ అధ్యక్షుడు నితీశ్, ప్రధాన కార్యదర్శి సూరజ్, యువకులు శివ, అజయ్, రాహుల్, శ్రీను, పాల్గొన్నారు.