గుర్రంపోడు, డిసెంబర్ 21: సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని మొసంగి గ్రామంలో రూ. 20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు వచ్చే ప్రతిపైసా ప్రజల అవసరాలకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలు కొత్తరూపు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మైలాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఐతరాజు యాదయ్యను, ఎల్లమోనిగూడేనికి చెందిన కూర వెంకటయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ
మండలంలోని మొసంగి గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చిన్నయ్యతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, సర్పంచ్ ఎన్నమల కృష్ణప్రసాద్, ఎంపీడీఓ శ్రీపాదసుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రావులపాటి భాస్కర్, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి అభినయ్ యాదవ్, సింగం ప్రవీణ్, సర్పంచులు చాడ చక్రవర్తి, కేసాని యాదగిరిరెడ్డి, జక్కల భాస్కర్, వడిత్య నాగరాజు, మెగావత్ దస్రునాయక్, నరేందర్, ఏ.నగేశ్, శ్రీను, బాలరాజు పాల్గొన్నారు.