గుర్రంపోడు, నవంబర్19: అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మరోమారు సీఎం కావాలని అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అ న్నారు. ఆదివారం మండలంలోని తేనెపల్లి తండా, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్), సుల్తాన్పురం, పాశంవారిగూడెం, చింతగూడెం, కాల్వపల్లి, మొండికానిగూడెం, పాల్వాయి, కట్టవారిగూడెం, గుర్రంపోడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు బోనాలు, డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 24 గంటల కరెంటు ఇస్తుందని తెలిపారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాడో ఆలోచించాలని అన్నారు. ప్రజ లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 11 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ యే అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
కేసీఆర్ మూడో సారి ముఖ్య మంత్రి అయిన వెంటనే రూ.400కే గ్యాస్ సిలెండర్, వితంతు, వృద్ధాప్య పెన్షన్ల పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మెన్ ఆరిగి పెద్దులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనంజయ్, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్రావు, ఉపాధ్య క్షుడు వెలుగు రవి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎల్ఎన్రెడ్డి, పోలేని ముత్యాలు, దైదా శ్రీనివాస్రెడ్డి, సర్పంచలు వడిత్య రజితనాగరాజు నాయక్, మండలి దీపరాములు, బచ్చనబోయిన రేణుకశ్రీనివాస్, వాడపల్లి రంగమ్మ చంద్రమౌళి, పాశం అలివేలమ్మగోపాల్రెడ్డి, పాల్వాయి కరుణశీనయ్య, దుండిగళ్ల పద్మవెంకటేశ్వర్లు, చాడ చక్రవర్తి, ఉట్లపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు మల్లోజు శ్రీనివాసాచారి, మేకల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
హాలియా : రాష్ట్రంలో, కేంద్రంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు తోడు దొంగలు అని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఆదివారం అనుముల, తిరుమలగిరి సాగర్, పెద్దవూర మండలాలకు చెందిన బీజేవైఎం నాయకులు మేకల సతీష్, శేఖర్, వాడపల్లి వినయ్, సింగారపు శ్రీనివాస్, మట్టపల్లి శివ, మర్రి వెంకటయ్యతో పాటు 100మంది యువకులు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మె ల్సీ కోటిరెడ్డి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ, పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ వెనుకబాటుకు జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీయే కారణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే ప్రజలు కరెంట్ కష్టాలను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించారు. కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భగత్కుమార్ను అత్యధిక మోజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, పెద్దవూర జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, సాదం సంపత్కుమార్,హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, సర్పంచ్ లింగయ్యయాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు రవినాయక్,లింగారెడ్డి, కర్నాటి మునిరెడ్డి, మాజీ ఎం పీపీ ఏడుకొండల్, పంగ లక్ష్మణ్, బోయ నరేందర్రెడ్డి, హైమద్ అలీ, యూత్ అధ్యక్షుడు సైదులు, నడ్డి సత్యం, రవినాయక్, వెంకట్రెడ్డి ఉన్నారు.
పెద్దవూర: మండలంలోని కేకే తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్య క్షుడు రమావత్ సక్రునాయక్, రమావత్ వేణునాయక్ అదే విధం గా మండలంలోని బట్టుగూడెం, ఈదలగూడెంకు చెందిన 15మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.