మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 21 : సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంంలోని జంకుతండా గ్రామపంచాయతీ శివారు మాలోతుతండాలో రూ.13.20 లక్షలతో పునరుద్ధరించిన ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల భవిష్యత్కు బడిలోనే పునాది పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని మనఊరు-మనబడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొదటి దఫా రూ.40 కోట్లతో 72 పాఠశాలల పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అందుకు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించాలని సూచించారు. అనంతరం జంకుతండాలో రూ.18.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రంజాన్ను పురస్కరించుకొని తండాలోని ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుకొండల్, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మట్టపల్లి సైదులు, ప్రసాద్, సర్పంచ్లు మాలోతు రవీందర్నాయక్, బారెడ్డి అశోక్రెడ్డి, చౌగాని భిక్షంగౌడ్, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంఈఓ మాలోతు బాలజీ నాయక్, పీఆర్డీఏ ఏఈలు వెంకటేశ్వర్రావు, ఆదినారాయణ, బీఆర్ఎస్ నాయకులు చింత వెంకటేశ్వర్లు, రామకృష్ణ, విజయ, భిక్షానాయక్, శ్రీనివాస్, బచ్చలకూరి శ్రీనివాస్, నాగరాజు, దుర్గయ్య పాల్గొన్నారు.
ఇర్కిగూడెం పాఠశాలలో..
దామరచర్ల : మండలంంలో ఇర్కిగూడెంలో రూ.14.43 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని, ఫర్నిచర్ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన ముడిమాల కోటిరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రి ఖర్చులకు రూ.2లక్షలు మంజూరు చేయించిన ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గెపూడి నారాయణ రెడ్డి, ఎంపీపీ ధీరావత్ నందినీరవితేజ , వైస్ ఎంపీపీ కటకం సైదులురెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలితాహతీరాం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరకోటిరెడ్డి, ఎండీ యూసుఫ్, ఎంపీటీసీ రాయికింది సైదులు, సర్పంచ్ లొట్లపల్లి నాగేంద్రశేఖర్, ఎంఈఓ బాలజీనాయక్, హెచ్ఎం దైద సత్యం పాల్గొన్నారు.