అడ్డగూడూరు, డిసెంబర్ 18: తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వగ్రామం ధర్మారం మొదటిసారిగా సోమవారం వచ్చారు. అంతకుముందు అడ్డగూడూరు మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు ఎడ్లబండిని పూలతో అలంకరించి ఇంటి వరకు తీసుకువచ్చారు.
ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏండ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని భారీ మోజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటామని హమీ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణానికి , ప్రభుత్వం నిర్మించే సీసీ రోడ్లు, భవనాలకు మాత్రమే ఇసుకను ఉపయోగించాలని తెలిపారు.
మారుమూల గ్రామంలో పుట్టి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండలాధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్, నాయకులు పైళ్ల సోమిరెడ్డి, ఇటికాల చిరంజీవి, చేడే చంద్రయ్య, జోజి, బొమ్మగాని లక్ష్మయ్య, గూడెపు పాండు, మత్స్యరెడ్డి, వల్లంభట్ల రవీందర్ పాల్గొన్నారు.
తుంగతుర్తి :మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించనున్న మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరవుతున్నట్లు ఎంపీడీఓ భీమాసింగ్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.