చండూరు, ఏప్రిల్ 12 : తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపితే.. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి కలిగేలా పథకాలను పంచిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బీఆర్సీ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు చిట్యాల మండలం వెల్మినేడులో జరిగిన సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలంతా ఆలోచించాలన్నారు.
తొమ్మిదేండ్ల క్రితం కరెంట్ ఎట్లా ఉండే.. వ్యవసాయం, సాగునీరు వంటివి ఎట్లుండే.. గిప్పుడు ఎట్లా ఉన్నయ్ అనే విషయమై బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. ఆడపిల్ల పెండ్లికి గత పాలకులు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని, సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తూ రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. నాడు అట్టడుగున ఉన్న తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
బీజేపీని గెలిపిస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. పైగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని పేర్కొన్నారు. పేదలను దోచుకోవటం బీజీపీ వంతైతే.. వారిని ఆదుకోవటం సీఎం కేసీఆర్ నైజం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ చేరవేయాలని, బీజేపీ, కాంగ్రెస్ పాలకులు చేస్తున్న కుట్రలను కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తెచ్చేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపు నిచ్చారు.
ప్రతి గ్రామానికి కోట్ల రూపా యల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాబోయే తరం కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని, ముందు చూపుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీల నాయకులు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి దిక్కుతోచని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కుటుంబంపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నదన్నారు.
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకునేందుకు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం ప్రజలకోసమే పని చేస్తున్నానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుంచే ప్రజల వద్దకు వెళ్లి గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమైక్య పాలనలో మునుగోడు నియోజకవర్గలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, గుక్కెడు మంచినీటి కోసం ఢిల్లీ బాట పట్టారన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరైడ్ పీడ విరగడైందన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారి ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారని, చాలా మంది మృత్యువాత పడ్డారన్నారు. కానీ నేడు అన్ని ప్రధాన రహదారులు డబుల్ రోడ్లుగా మారడంతో ప్రయాణం సులభం కావడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గాయన్నారు. మునుగోడు అభివృద్ధి పథంతో ముందుకు పోతున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన రాజగోపాల్రెడ్డి నియోజకవర్గాన్ని నాలుగు సంవత్సరాలు భ్రష్టు పట్టించాడన్నారు. ఉప ఎన్నికల తరువాత నాలుగు నెలల్లోనే నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మరో 400 కోట్ల నిధులు త్వరలోనే రానున్నట్లు తెలిపారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 14 ఏండ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కలలను నిజం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గానికే పరిమతం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ప్రజలందరికీ రక్షిత తాగునీటిని అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, రాష్ట్ర నాయకుడు మునగాల నారాయణరావు, వేనేపల్లి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి, ఎంపీపీ పల్లె కల్యాణి, చండూరు మున్సిల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావు, నాయకులు ఎత్తపు మధుసూదన్రావు, కోడి వెంకన్న, పెద్దగోని వెంకన్న, నర్సాజీ, ఇడెం కైలాసం, సర్పంచులు పల్లె వెంకటయ్య, నందికొండ నర్సిరెడ్డి, అధిక సఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.