రామగిరి, నవంబర్ 5 : బీఆర్ఎస్ పాలనలోనే దివ్యాంగులకు భరోసా లభించిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. భౌతికంగా దివ్యాంగులు కానీ మానసికంగా ధృఢత్వం కలిగినవారు అని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు కేవలం రూ.500 పింఛన్ కోసం 500 సార్లు తిరిగితే ..సగం నొక్కి మిగితావి మాత్రమే ఇచ్చేవారని అలాంటి దుర్మార్గపు నాయకుడు ఇప్పుడు మేకతోలు కప్పుకొని వస్తున్నాడని అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ చేసిన సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చకిలం అనిల్కుమార్, ఆ సంఘం నిర్వాహకులు కందుల లక్ష్మయ్య, పెరిక శ్రీనివాసులు, అంజిరెడ్డి, గుండెబోయిన ఉపేందర్, గుర్రం నాగయ్య, చింత వెంకన్న పాల్గొన్నారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో చినవెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం,బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికలో ఆయన హాజరై మాట్లాడారు. దేశంలోనే బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ధూప,దీప నైవేద్య పథకం కింద అర్చకుల ఇచ్చి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చకిలం అనిల్కుమార్, చకిలం వేణుగోపాల్రావు, బొల్ల వేణుగోపాల్రావు, మంగళగిరి ఫణిఆచార్య పాల్గొన్నారు.
రామగిరి : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డు ఇన్చార్జి యాట జయప్రదారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కంచనపల్లి రవీందర్ రావు, దండేపల్లి శంకర్, గడిపల్లి కోటి, దిలీప్ ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కంచర్ల గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.