తిప్పర్తి, నవంబర్ 23 : 20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేశానని, మళ్లీ ఆశీర్వాదిస్తే పూర్తి స్థాయిలో మండలాన్ని అభివృద్ధి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తిప్పర్తి, మర్రిగూడెం, గడ్డికొండారం, జంగారెడ్డిగూడెం, రామలింగాలగూడెం, కాశివారిగూడెం, దుప్పలపల్లి,కంకణాలపల్లి, తానేదార్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో కాశీవారిగూడెం , మామిడాల వద్ద బ్రిడ్జీలు లేకుంటే నిధులు మంజూరు చేయించి తానే పూర్తి చేయించనన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులు వ్యవసాయం చేయలేక వలసలు పోయేవారని, నేడు వ్యవసాయం పండుగ మారిందన్నారు. మండలంలోని డబ్బు కట్టలకు అమ్ముడు పోయిన నాయకుల మాటలు నమ్మకండి వారి స్వార్థం కోసం అమ్ముడు పోయారని విమర్శించారు. మూడో సారి ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ విజయం సాధించడం ఖాయమన్నారు. మళ్లీ రెండో సారి తిప్పర్తి మండలం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన 20 మంది మైనార్టీ నాయకులు గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, జీడిపల్లి వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్రెడ్డి, కందుల లక్ష్మయ్య, కట్టా సూర్యప్రకాశ్రెడ్డి, తండు నర్సింహగౌడ్, వి.నాగేశ్వర్రావు, బైరగోని శ్రీనివాస్, సిరసవాడ సైదులు, జి.రామచంద్రు, దాసరి జానయ్య, రంజాన్, కరీం, బత్తిని పురుషోత్తం, ఇంద్రసేనారెడ్డి, కొన జానయ్య పాల్గొన్నారు.