నీలగిరి, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ పాలన రాష్ర్టానికి శ్రీరామరక్ష అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్లో గృహాలక్ష్మి లబ్ధ్దిదారులకు ప్రోసిడింగ్స్, బతుకమ్మ చీరెలు, స్ప్టోర్స్ కిట్లు లబ్ధ్దిదారులకు జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్రెడ్డి, మున్సిఫల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవిర్భావం తరువాత సీఎం కేసీఆ నిరుపేదలకు కావాల్సిన వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తుండడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటూ పండుగలు చేసుకుంటున్నారని అన్నారు.తెలంగాణ ఆడబిడ్డలకు దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెలు అందిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతంలో యువకులు క్రీడాల్లో రాణించేలా ప్రభుత్వం క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నదన్నారు. విపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, కౌన్సిలర్లు ఇబ్రహీం, అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావు, మారగోని గణేశ్, ఉట్కూరి వెంకట్రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, మున్సిపల్ అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు నిమ్మనగోటి, కొంగల సతీశ్, కందికట్ల యాదగిరి, యాదమ్మ, రజిత, కృష్ణవేణి, ప్రసన్న ఉన్నారు.
నల్లగొండ 3వ వార్డుపరిధిలోని ఎఫ్సీఐ హమాలీ కాలనీలో రూ.32 లక్షలతో చేపట్టిన విద్యుద్ధ్దీకరణను మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో కౌన్సిలర్ పేర్ల జానయ్య, సీపీఎం నాయకులు సయ్యద్ హశం, ఎండీ సలీం, మాజీ జడ్పీటీసీ పాలకూరి యాదయ్య పాల్గొన్నారు.
తిప్పర్తి : మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం గృహలక్ష్మి, బతుకమ్మ చీరెలు, స్పోర్ట్స్ కిట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ దశల వారీగా గృహలక్ష్మి పథకం వర్తించనుందన్నారు. వ్యవసాయం రంగం దేశంలో ప్రథమ స్థ్దానంలో ఉందని, నిరంతర విద్యుత్, నీటి వనరులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రైతులకు పెట్టుబడి సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కా ర్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్లు రొట్టెల రమేశ్, సిరిగిరి పద్మావెంకట్రెడ్డి, ముత్తినేని శ్రీదేవి, సర్పంచులు ఎంపీటీసీలు, సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కందుల రేణుకాలక్ష్మయ్య, ప్రధానకార్యదర్శి నాగేశ్వర్రావు, ఎంపీఓ నర్సింహస్వామి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మండలంలోని దోమలపల్లి చెరువులో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పీషరిస్ జిల్లా అధికారి వెంకటయ్యతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లగొండ మండలంలో 35-40 ఎంఎం సైజులో62 చెరువులలో 15.89 లక్షల చేప పిల్లలు, 80-100 ఎంఎం గల సైజులో మూడు చెరువులలో 16.40 లక్షలు పెద్ద చేప పిల్లలు వదులుతున్నట్లు తెలిపారు. మండలంలో మొ త్తం 62 చెరువుల్లో 33 లక్షల చేప పిల్లలను వదులుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, సర్పంచ్ ఉపేంద్రచారి, ఎంపీటీసీ మల్లేశ్గౌడ్, నాయకులు గాదె రాం రెడ్డి, తవిట కృష్ణ, అమృతారెడ్డి, మామిండ్ల సైదులు, స్వామి, బడుపుల శంకర్, నగేశ్, బొల్లేపల్లి శంకర్, రాంబాబు పాల్గొన్నారు.