తిరుమలగిరి/శాలిగౌరారం, జూన్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో మండల పరిధిలోని వెలిశాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కిశోర్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే శాలిగౌరారం మండలం మాదారం కలాన్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి 10 కుటుంబాలు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజారంజక పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రఘునందన్రెడ్డి, ఐతగోని వెంకన్నగౌడ్, సర్పంచ్ ఆకుల వీరయ్య, బీఆర్ఎస్ నాయకులు చాడ హతీశ్రెడ్డి, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, దూపటి రవీందర్, మౌలానా, తాళ్లూరి మురళి, మామిడి సర్వయ్య, చింతల శంకర్, నోముల శ్రీనివాస్, రాపాక రాజు పాల్గొన్నారు.
ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలి
తిరుమలగిరి : ఈ నెల 26న తిరుమలగిరిలో జరిగే తుంగతుర్తి ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమలగిరిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26న సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రగతి నివేదన సభకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా జన సమీకరణకు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, ఎంపీపీ స్నేహలత, మాజీ ఎంపీపీ సతీశ్కుమార్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.