మద్దిరాల, మార్చి 2 : సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ముకుందాపురం, మామిండ్లమడవ, తూర్పుతండా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముకుందాపురం, తూర్పుతండాల్లో దాదాపుగా రూ.1.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలో ఒక్కసారిగా రూ. 20 లక్షలు అభివృద్ధి పనులకు కేటాయించలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న, జడ్పీటీసీ కన్న సురాంబ వీరన్న, తాసీల్దార్ అమీన్సింగ్, వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, సర్పంచులు అక్కిరెడ్డి జ్యోతీఉపేందర్రెడ్డి, భూక్య పద్మావీరన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా నాయకులు మల్లు కపోతంరెడ్డి, ఎంపీడీఓ సరోజ, పీఆర్ ఏ నవీకాంత్ పాల్గొన్నారు.
మామిండ్లమడవలో రూ. 10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్యెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన యువజన నాయకుడు మల్లు ఉపేందర్రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీజ, ఉపసర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.
నూతనకల్ : మండలంలోని తాళ్ల సింగారం నుంచి సోమ్లాతండాకె వెళ్లే రహదారిపై రూ.77 లక్షల నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరూ కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగేందర్, ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, పన్నాల సైదిరెడ్డి, తాడూరి లింగయ్య, బద్దం ప్రశాంత్రెడ్డి, బద్దం వెంకటరెడ్డి, గుగులోతు సజ్జన్నాయక్, యాదగిరి, వీరు యాదవ్ పాల్గొన్నారు.