కట్టంగూర్లోని అంబేద్కర్నగర్, హైస్కూల్ సమీపంలోని పెద్దవాగుపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి శుక్రవారం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయడంపై స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. బ్రిడ్జిల నిర్మాణంతో అంబేద్కర్నగర్, అంబటివాగు ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి.
– కట్టంగూర్, జూన్ 23
కట్టంగూర్, జూన్ 23 : కట్టంగూర్లోని అంబేద్కర్నగర్, హైస్కూల్ సమీపంలోని పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రూ.4కోట్లు మంజూరు చేశారు. దాంతో హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ తరాల బలరాములు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం విషయంలో సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల అంబేద్కర్నగర్, అంబటివాగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పోగుల నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, నాయకులు అంతటి శ్రీను, మేకల రమేశ్, మునుగోటి ఉత్తరయ్య, రెడ్డిపల్లి మనోహర్, మేడి రాములు, మాతంగి యాదయ్య, పెద్ది బాలనర్సయ్య, మేకల జనార్దన్, బొల్లెద్దు యాదయ్య, పులిగిల్ల వెంకన్న, నమ్ముల సత్యనారాయణ పాల్గొన్నారు.