HomeNalgondaMla Chirumarthi Lingaiah That Many Development And Welfare Schemes Are Being Implemented In Telangana Under The Leadership Of Cm Kcr
ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
కట్టంగూర్, ఫిబ్రవరి 23 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని మల్లారం, కట్టంగూర్ గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్ది ఫౌండేషన్ చైర్మన్ పెద్ది బాలనర్సయ్య, ఉప సర్పంచ్ గాదగోని సుజాత, ఐతగోని రాములు, పెద్ది భిక్షం, గోగు సైదులు, చిత్తలూరి లక్ష్మి, గుండు అంజయ్య, కానుగు జానయ్య, కానుగు చంద్రమ్మ, ఆకుల కృష్ణయ్యతోపాటు 200 మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం నార్కట్పల్లిలోని క్యాంపు కార్యాలయలంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని, ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండల్, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, దాసరి సంజయ్కుమార్, కట్టంగూర్ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని జనార్దన్, మండల ఉపాధ్యక్షులు బొల్లెద్దు యాదయ్య, నాయకులు అంతటి శ్రీను, రెడ్డిపల్లి మనోహర్, పొడిచేటి సైదులు, నమ్ముల సత్యనారాయణ, మునుగోటి ఉత్తరయ్య, సాలమ్మ, రేణుక, పోగుల సాయి పాల్గొన్నారు.