బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా చేరుతున్నారు. గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లి, చిట్యాల పట్టణంలోని 12వ వార్డు, రామన్నపేట మండల కేంద్రానికి చెందిన పలువురు గులాబీ కండువా కప్పుకొన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో తిరుమలగిరి సాగర్ మండలం సుంకిశాల తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
– హాలియా/ కట్టంగూర్/ చిట్యాల/ నాగారం, ఆగస్టు 10
చిట్యాల, ఆగస్టు10 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. పట్టణంలోని 12వ వార్డుకు చెందిన ఫార్వర్డ్బ్లాక్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 200 కుటుంబాలు గురువారం నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ, నితద్ధతతో పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో బొలుగూరి సైదులు, మోత్కూరి వెంకన్న, ఈశ్వర్, బొలుగూరి శంకరయ్య, యాదమ్మ, సిలువేరు లింగమ్మ, బైరు మంగమ్మ, జిట్ట నరేశ్, సైదులు, మల్లేశ్, శ్రీను, పాల నరేశ్, తండు విష్ణు, గణేశ్, దివ్య, రాధ, మేడి నర్సింహ, అశోక్, ఫరీదాబేగం, చేపూరి సైదులు, కృష్ణ, శ్రీకాంత్, ఆండాలు, సుజాత, నరేశ్, వెంకన్న, కుక్కల శ్రీను ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, జగిని భిక్షంరెడ్డి, జిట్ట చంద్రకాంత్, చిత్రగండ ప్రవీణ్, మేడి రాజు, జాల ప్రకాశ్ పాల్గొన్నారు.
ఇస్మాయిల్పల్లిలో 50 మంది చేరిక
కట్టంగూరు/రామన్నపేట : కట్టంగూరు మండలంలోని ఇస్మాయిల్పల్లిలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పెంజర్ల ముత్తయ్య, పులిగిల్ల అంజి, పెంచర్ల లింగయ్య, బండారు శంకర్, చిలుకూరి నగేష్, రేకల నర్సింహ, రేకల శ్రవణ్, రేకల రాకేశ్, యన్నమల్ల నవీన్, ముక్కాముల సైదులు, పెంజర్త నాగరాజు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అలుగుబెల్లి శేఖర్రెడ్డి, నాయకులు ఆంజనేయులు, వెంకన్న, భిక్షం, సైదులు, రవి, సాయి పాల్గొన్నారు. అలాగే రామన్నపేటకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు బాలగోని కల్యాణ్తోపాటు 20 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, ఎంపీటీసీ గొరిగె నర్సింహ, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు రాములు, రమేశ్, వెంకన్న, ఇనాయత్, శివ, రాము, నాసర్, లక్ష్మణ్, నరేశ్, రాజు పాల్గొన్నారు.