కోదాడ, ఫిబ్రవరి 26 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ నంబర్ వన్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన సమక్షంలో మునగాల మండలంలోని విజయరాఘవాపురం సర్పంచ్ యశోదతో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నిరాటంకంగా వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కొత్త, పాత అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే పార్టీ ఒక్క బీఆర్ఎస్నేనని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని బీమా సౌకర్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి నియోజకవర్గ అధ్యక్షుడు సుంకర అజయ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, సర్పంచులు జొన్నలగడ్డ శ్రీనివాస్రావు, వేనేపల్లి వెంకటేశ్వర్రావు, రమాశ్రీనివాస్, వీరబాబు, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుండు లింగారావు, గ్రామశాఖ అధ్యక్షుడు కోటయ్య, దుర్గాప్రసాద్, హనుమంతు, నాయకులు పాల్గొన్నారు.