మిర్యాలగూడ రూరల్, జనవరి 3 : పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం, చిల్లాపురం, కుంటకింది తండా, భగ్యగోప సముద్రంతండా, చిల్లాపురం, లావూడితండాల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.1.60 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, ఆగ్రో చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు ఏడుకొండలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, పీఆర్ డీఈ, ఏఈలు వెంకటేశ్వర్రావు, చిల్లంచర్ల ఆదినారాయణ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, సర్పంచులు చావలి, సావిత్రి, శంకర్ నాయక్, రామచంద్రునాయక్, ధనావత్ సూర్య, దాములూరి రంగారావు, అనూష పాల్గొన్నారు.