మిర్యాలగూడ: రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 410మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆర్డీవో రోహిత్సింగ్తో కలిసి రూ.4 కోట్ల 10 లక్షల 47 వేల 560 రూపాయల విలువైన చెక్కులు అందజేసి మాట్లాడారు.
రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన చేస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ది ఒక స్వర్ణ యుగ పాలన కొనియాడారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.13 వేలు, కేసీఆర్ కిట్, పెరిగి పెద్దయ్యి పెళ్లీడుకు వచ్చినప్పుడు కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకం ద్వారా రూ లక్షా 116 అందించి ఆడపడుచుల తల్లిదండ్రులకు అండగా నిలుస్తు న్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మోసీన్ అలీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.