మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 20 : ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేందుకు, సకల వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దింది.
ఈ క్రమంలో మిర్యాలగూడ మండలంలోని మాలోతు తండా ప్రాథమిక పాఠశాల మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయంగా రంగులు వేయించారు. విద్యార్థులకు ఫర్నిచర్ సమకూర్చారు. తరగతి గోడలపై వేసిన రంగురంగుల విజ్ఞాన బొమ్మలు విద్యార్థులను ఆకర్శిస్తున్నాయి. ఇప్పుడు మెరిసిపోతున్న బడిని చూసి విద్యార్థులు, గ్రామస్తులు మురిసిపోతున్నారు.