దేవరకొండ, మార్చి 21 : బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ అవసరమైన నిధులను మంజూరు చేసిందన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ కు రంజాన్ పర్వదినం ప్రతీక అన్నారు.
మైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, నేటికీ గుణాత్మక ఫలితాలనిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్యా నాయక్, కిషన్ నాయక్, టీవీఎన్ రెడ్డి, జానీ బాబా, నీలా రవి కుమార్, హరిలాల్, రూప్లే నాయక్, అంజి గౌడ్, ముత్యాల రవి, మధు, మురళి, వాజీద్ పాషా, రాజు, కృష్ణ పాల్గొన్నారు.